

జనం న్యూస్ మే 15 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారులకు సిబిల్ స్కోర్ ఆధారంగానే ఎంపిక చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడాన్ని బిఆర్ఎస్ కూకట్ పల్లి నియోజకవర్గ ఎస్ సి విభాగ అధ్యక్షులు బొట్టు విష్ణు ఖండించారు. సిబిల్ స్కోర్ నిబంధన వెంటనే ఎత్తివేయాలని లేని యెడల యావత్ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతాయి అని హెచ్చరించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బి సి, మైనారిటీ ఇబీసీ లలో ఉన్న నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఆరు వెల కోట్ల రూపాయలతో ఐదు లక్షల మందికి రుణాలు ఇవ్వాలని నిర్ణయం చేసి దరఖాస్థులు స్వీకరించింది. ప్రభుత్వ నిర్ణయతో పద హరు లక్షల మంది నిరుద్యోగ యువత, నిరుపేదలు, దళితులు గిరిజనులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్థులు స్వీకారణ పూర్తి అయిన తరువాత సిబిల్ స్కోర్ ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించడం లబ్ధిదారుల నోట్లో మట్టికోట్టడమే అవుతుంది అని విమర్శించారు. అంబేద్కర్ అభయహస్తం ఊసే లేదని, ఒక లక్ష నుండి నాలుగు లక్షల నిబంధనతో పేదల బతుకుల్లో ఇలాంటి మార్పు రాదని అన్నారు. కనీసం పది లక్షలు వరకు నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందిచలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధన ఎవ్వరి ప్రయోజనలకోసం. ప్రభుత్వం నిర్ణయం వలన అనేక మంది పేదలకు ఒక్కరికి కూడా రాజీవ్ యువ వికాసం రుణాలు వచ్చే అవకాశం లేదనీ అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం సిబిల్ స్కోర్ నిబంధనను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తుందనీ పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు.