Listen to this article

మొదటిసారి తలంబ్రాలు అందుకోవడం మా అదృష్టమన్న గ్రామస్తులు

రామకోటి రామరాజును ఘనంగా సన్మానించిన ఆలయకమిటీ

జనం న్యూస్, మే 16 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )

భద్రాచల రామయ్య ముత్యాల తలంబ్రాల పంపిణీ గురువారంనాడు శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు, గజ్వేల్ మండల దిలాల్ పూర్ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నర్సింహా స్వామి దేవాలయంలో తలంబ్రాల విశిష్టత వాటి పవిత్రత తెలియజేసి భక్తులందరికి అందజేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ భద్రాచలం రామయ్య కల్యానానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 250కిలోల గోటి తలంబ్రాలు అందించామన్నారు. భక్తికీమెచ్చి తిరిగి 100కిలోల తలంబ్రాలు అందించారన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గోటి తలంబ్రాల్లో పాల్గొన్న వారికి అందిస్తున్నామన్నారు. తలంబ్రాలు మొదటిసారిగా అందుకోవడం మా అదృష్టం అని ఈ సందర్బంగా ఆలయ కమిటీ రామకోటి రామరాజును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు సంతోష్ రెడ్డి, రాజేశంగుప్త, రఘుపతిరెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, వేణుగోపాల్ చారి పాల్గొన్నారు.