

అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి
పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి
మునగాల పిఎసిఎస్ చైర్మన్ కందిబండ సత్యనారాయణ, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఉడుం కృష్ణ
జనం న్యూస్ మే 16 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్
అనర్హులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించారని ఆరోపిస్తూ గురువారం మునగాల తహసిల్దార్ కార్యాలయం ఎదుట మునగాల మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మునగాల పిఎసిఎస్ చైర్మన్ కందిబండ సత్యనారాయణ, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఉడుం కృష్ణ మాట్లాడుతూ.. అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లను కేటాయించారని, పూర్తిస్థాయి సర్వే నిర్వహించకుండా ఎంపిక చేసిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల లిస్టును తొలగించి అర్హులకు ఇల్లు కేటాయించి ఇందిరమ్మ కమిటీలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.అనంతరం తహసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎల్పి రామయ్య, నాగబాబు, వసంత్ కుమార్, చీకటి శ్రీను, వేట శివాజీ, గడ్డం లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.