

జనంన్యూస్. 15. సిరికొండ. ప్రతినిధి.
నిజామాబాదు జిల్లా సిరికొండ మండల కేంద్రం లోని కొండాపూర్ గ్రామ శివారులోని వాగులో నుంచి కొంతమంది వ్యక్తులు అక్రమంగా ఇలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తుండగా సిరికొండ ఆర్ఐ కాస గంగారాజం అట్టి ట్రాక్టర్లను రెండింటిని పట్టుకొని పంచనామ నిర్వహించి సిరికొండ ఎస్సై కి సమాచారం ఇవ్వడంతో సిరికొండ ఎస్సై అట్టి రెండు ట్రాక్టర్లను మరియు డ్రైవర్లను దాని ఓనర్లను పట్టుకొని వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనైనదని సిరికొండ ఎస్ఐఎల్ రామ్ గారు తెలుపండి ట్రాక్టర్ డ్రైవర్ల పేర్లు మెట్టు మర్రి తండా కు చెందిన కేతావత్ మురళి మరియు అతని ట్రాక్టర్ మహేంద్ర యువ మరియు కొండాపూర్ గ్రామానికి చెందిన మామిడి నరసయ్య అతని ట్రాక్టర్ కుబోట దాని డ్రైవర్ శివరాత్రి రామకృష్ణ గార్లపై కేసు నమోదు చేసి ఇకపై ఎవరైనా అక్రమంగా ఇసుకను ప్రభుత్వ అనుమతులు లేకుండా తరలించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిరికొండ ఎస్ఐఎల్ రాం తెలిపారు.