

(జనం న్యూస్ చంటి)
దౌల్తాబాద్ మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రేపు ప్రతి పాఠశాలల్లోనూ లేదా గ్రామ పంచాయితీల్లో పెద్ద ఎత్తున తల్లిదండ్రుల ఉపాధ్యాయులు సమావేశం నిర్వహించాలని మండల విద్యాధికారి గజ్జల కనకరాజు అన్నారు ప్రభుత్వ పాఠశాలలో యొక్క అడ్మిషన్లు జరగాలని దీనికి ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు బాగా కృషి చేయాలని సూచించారు అదేవిధంగా మండలంలోని విద్యార్థులకు ఏకరూప దుస్తులు కుట్టడం టైలరింగ్ సెంటర్ దగ్గరికి వెళ్లి మండల విద్యాధికారి పరిశీలించారు రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 నాటికి విద్యార్థులకు ఏకరూప దుస్తులు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో సిఆర్పి నగేష్, రాజు మండల వనరుల కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.