Listen to this article

జనం న్యూస్ మే 16 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

నూకాంబిక అమ్మవారు మాల ధారణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం జనసేన కార్యాలయంలో శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ ను సంఘ సభ్యులు కలుసుకొని శ్రీశ్రీశ్రీ నూకాంబిక అమ్మవారు జాతర మహోత్సవ ఉత్సవాలు రాష్ట్ర పండుగ నెలరోజులపాటు అద్భుతంగా ఆనందంగా ఆహ్లాదకరంగా జిల్లా ప్రజలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నుండి అమ్మవారి దర్శనo నకు విచ్చేసిన వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వేసవికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్ని తీసుకొని ప్రశాంతమైన వాతావరణంలో నెల రోజులు పాటు నిర్వహించిన శాసనసభ్యులు రామకృష్ణ కృషి మరువలేమని, మాల ధారణ ఊరేగింపులో పాల్గొని భక్తులను ఉత్సాహపరిచి అమ్మవారి ఊరేగింపును జయప్రదం కావడానికి పోలీస్ బందోబస్తు దేవస్థానం సహకారం సంపూర్ణంగా అందించినందుకు శాసనసభ్యులకు జనసేన ఇంచార్జ్ భీమరశెట్టి రాంకీ కి దేవస్థానం చైర్మన్ నాగ శ్రీనుకు పాలకమండలి సభ్యులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని మాకు సంపూర్ణ సహాయ సహకారాలు అందించిన దేవస్థాన సహాయ కమిషనర్ కు సిబ్బందికి మా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మాల ధారణ భక్తులు చైర్మన్ నాగశ్రీను కు శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మాల ధారణ గురు స్వామి పొలిమేర శ్రీను ను ఎమ్మెల్యే రామకృష్ణ శాలువాతో సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం సభ్యులు మల్ల గణేష్ కోలపర్తి శ్రీను సూరిశెట్టి శ్రీను సూరిశెట్టి ఉదయ్ మద్దాల అజయ్ పవన్ తేజ రాజు కృపాసాగర్ తదితరులు పాల్గొన్నారు.//