Listen to this article

మండల విద్యాధికారి ఎండి రహీమొద్దీన్

జనం న్యూస్, మే16,కంగ్టి

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలోని చర్చ్ వద్ద బడీడు పిల్లలను బడిలో చేర్పించాలని మండల విద్యాధికారి విద్యార్థుల సంరక్షకులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతం,బడి ఈడు పిల్లలందరికీ మెరుగైన విద్యను అందించడమే లక్ష్యంగా సర్కారు ఏటా బడిబాట కార్యక్రమం నిర్వహిస్తోంది.ప్రస్తుతం వేసవి సెలవులు ఉండటంతో మరో రెండు వారాల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.ఈ నేపథ్యంలో జూన్ 3న బడిబాట కార్యక్రమం ప్రారంభంకానుంది. రాష్ట్రవ్యాప్తంగా జూన్ 3 నుంచి 19 వరకు చిన్నారుల తల్లిదండ్రులకు విద్య ఆవశ్యకతను తెలియజేయనున్నారు. ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తూ సామూహిక అక్షరాభ్యాసం,బాలికా విద్య ప్రాముఖ్యత తెలియజేస్తూ చదువుకు దూరమైన పిల్లలను పాఠాశాలలకు తీసుకురావటమే లక్ష్యంగా బడిబాట కార్యక్రమాన్ని తలపెట్టారని అన్నారు. బడి ఈడు పిల్లల బడిలో ఉండాలి – రాష్ట్రవ్యాప్తంగా జూన్ 3 నుంచి 19 వరకు బడిబాట కార్యక్రమాలు చదువుకు దూరమైన పిల్లలను తిరిగి పాఠశాలలకు రప్పించడమే ప్రథమ ఎజెండాగా రూపొందిన బడిబాడ కార్యక్రమం జూన్ 3న ప్రారంభంకానుంది.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకతను వివరిస్తూ ఇంటింటి ప్రచారం చేయనున్నారు.బడి ఈడు ఉండి చదువుకు దూరమైన విద్యార్థులను తిరిగి బడుల్లో చేర్చేందుకు సర్కారు షెడ్యూల్ నిర్ణయించిందని అన్నారు.2025-26 విద్యా సంవత్సరానికి గాను జూన్ 3 నుంచి 19 వరకు రాష్ట్రవ్యాప్తంగా బడిబాట కార్యక్రమం నిర్వహించనున్నట్టు సర్కారు ప్రకటించింది. ఈ మేరకు జిల్లా విద్యా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కార్యక్రమంలో బడి వయసు పిల్లలను గుర్తించి దగ్గర్లోని పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను అందించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచి పాఠశాలలను బలోపేతం చేయనున్నట్లు నిర్ణయించింది. భలే మంచి మాస్టార్.. ‘బడిబాట’ను ఎంత బాగా ప్రచారం చేస్తున్నారో..! ఇందులో భాగంగా జూన్ 3 నుంచి 11 వరకు రోజూ ఉదయం 7నుంచి 11 గంటల వరకు విద్యార్థుల నమోదు చేపట్టనున్నారు.గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహించి విద్యార్థుల నమోదుపై చర్చించనున్నారు.4న ఇంటింటికి వెళ్లి బడి ఈడు పిల్లల్లో విద్యకు దూరమైన వారిని గుర్తించి వారి పేర్లను పాఠశాలల్లో నమోదు చేయనున్నారు.ఇక 5 నుంచి 10 వరకు ఇంటింటికి వెళ్లి విద్యార్థుల నమోదుతో పాటు అంగన్వాడీల్లో పిల్లలను గుర్తించి వారిని ప్రాథమిక పాఠశాలల్లో నమోదు చేయనున్నారు.
ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎం యశ్వంత్,కిఫాయత్ అలీ,కీర్తి కుమార్, పోషకులు రామప్ప, సంగ్రామ్,విజయ్, నాగప్ప,తదితరులు పాల్గొన్నారు.