Listen to this article

జనం న్యూస్, మే, 17(తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)

చేర్యాల మండలంలోని నాగపురి గ్రామంలో శుక్రవారం రోజున విద్యా సంబంధమైన బహుళ కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎలికట్టే ఐలయ్య ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పిన్నింటి మల్లికార్జున్ రెడ్డి మరియు రామాంజనేయుల ఆధ్వర్యంలో గ్రామంలో ముందస్తు బడిబాట, మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్, ఉల్లాస్ మరియు హ్యాపీ ప్లే స్కూల్ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం అనేక సౌకర్యాలు వసతులు కల్పిస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలే గుడులని, బాలలే దేవుళ్ళని పాఠ్యపుస్తకాలే పవిత్ర గ్రంథాలని, పాఠశాల మరో భవిష్యత్తు ప్రపంచమని అందుకే ప్రభుత్వ పాఠశాలలకే గ్రామంలోని బడి ఈడు పిల్లలందరినీ పంపించాలని తల్లిదండ్రులను కోరారు.
ఈ కార్యక్రమంలో బోధన బోధన సిబ్బంది ఎస్. నిరూపమా అందే విజయ్ కుమార్ గొట్టం ప్రకాశ్ రెడ్డి కర్రోల్ల స్వర్ణ కుమార్ పి రాజేశ్వరి ఎస్ కనక లింగం బోపూరి బాల్ రెడ్డి బొల్లం సంపత్ స్వామి లు పాల్గొన్నారు.
అంతేకాకుండా తాజా మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఉల్లంపల్లి కరుణాకర్ తాజా మాజీ గ్రామ సర్పంచ్ బండ కింది కర్ణాకర్ నల్ల పోచమ్మ దేవస్థానం చైర్మన్ గూడెం మహేష్ ఎస్ఎంసి మాజీ చైర్మన్లు ప్రజ్ఞాపురం నరసింహులు, మోకు దేవేందర్ రెడ్డి మాజీ ఎంపీటీసీ కుందారపు రాములు గ్రామపంచాయతీ కార్యదర్శి ఏలూరు రాజు కారోబార్ తుమ్మ మనోజ్ కుమార్ వివో మంతపురి జ్యోతి ఏఏపిసి చైర్ పర్సన్స్ సభ్యులు, అంగన్వాడీ టీచర్స్ ఆశా వర్కర్స్ తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.