

మర్కూక్ ఎస్.ఐ దామోదర్
భద్రాచల తలంబ్రాలు అందుకోవడం మా అదృష్టం
జనం న్యూస్, మే 17 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )
భద్రాచల రామయ్య కళ్యాన తలంబ్రాలను శుక్రవారం నాడు మర్కూక్ ఎస్.ఐ దామోదర్ తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ కి తలంబ్రాల విశిష్టత వాటి పవిత్రత తెలియజేసి అందజేశారు. శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు. భద్రాచల కళ్యానానికి గోటి తలంబ్రాలు అందించారని తెలిపారు.
ఈ సందర్బంగా ఎస్.ఐ దామోదర్ మాట్లాడుతూ మాకు భద్రాచల దేవస్థాన తలంబ్రాలు అందడం సంతోషంగా ఉందన్నారు. లక్షల మంది భక్తులకు భక్తితో గ్రామ, గ్రామాన అందజేయడం రామకోటి రామరాజు, భక్తి అమోఘం అని శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.