Listen to this article

సిపిఐ మహాసభల విజయవంతం చేయండి

సిపిఐ మండల కార్యదర్శి ఆత్మకూరి చిరంజీవి

జనం న్యూస్ మే 16 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో

అసిఫాబాద్ మండల కేంద్రంలో జరిగే సిపిఐ మండల మహాసభలో ప్రతినిధులంతా సకాలంలో హాజరై విజయవంతం చేయాలని సిపిఐ మండల కార్యదర్శి ఆత్మకూరి చిరంజీవి పార్టీ శ్రేణులను కోరారు. శుక్రవారం అసిఫాబాద్ మండలంలోని అసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కంచుకోట శాఖ మహాసభలను నిర్వహించుకోవడం జరిగింది. కంచుకోట శాఖ కార్యదర్శి ఎర్రం మురళి జెండావిష్కరించి శాఖ సభలను ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆత్మకూరి చిరంజీవి మండల కార్యదర్శి మాట్లాడుతూ దేశంలో పాలకులు మతం పేరుతో, కులం పేరుతో ప్రజలను విడదీస్తూ ప్రజల ను కార్పోరేట్ల దోపిడీకి వదిలేస్తున్నారని, ప్రజల ఏ ఒక్క మౌలిక సమస్యను పరిష్కరించకపోగా… దేశ సంపదనంతా అదానీ,అంబానీలకు దోచిపెడుతున్నారని విమర్శించారు.పాలకుల పక్షపాత వైఖరిని ఎండగడుతూ నిత్యం పేదల సమస్యలపై స్పందిస్తున్న కమ్యూనిస్టు పార్టీలను ప్రజలు ఆదరించాలని, పాలకులు చేస్తున్న విడదీసే కుట్రలను ప్రజలంతా ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలుగా పేద ప్రజల హక్కుల కోసం, భూమికోసం భుక్తి కోసం పోరాటం చేస్తున్నదని అన్నారు.
కమ్యూనిస్టు పార్టీ ప్రజల కోసం ఎన్నో త్యాగాలు చేసిందని ఓట్ల కోసం సీట్ల కోసం కాకుండా ప్రజల సేవ కోసం పనిచేసే పార్టీ ఒక సిపిఐ మాత్రమేనని ఆ పార్టీ మహాసభల విజయవంతం కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు తాళ్లపెళ్లి దివాకర్ మండల కౌన్సిల్ సభ్యులు, శాఖ సభ్యులు మహేష్,రాకేష్,శ్యామ్,శంకర్,నరేష్,సాయి,దినకర్ తదితరులు పాల్గొన్నారు.