Listen to this article

జనం న్యూస్ మే 17 కాట్రేని కొన (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)


గ్రీస్ ఫీల్డ్ స్కూల్ విజయకేతన సీబీఎస్ఈ 2024-25 పదవ మరియు పన్నెండవ తరగతి ఫలితములలో సి బి ఎస్ సి బోర్డు నిబంధనలను అనుసరించి ఇవ్వబడిన ఫలితములలో గ్రీన్ ఫీల్డ్ స్కూల్ విద్యార్థినీ విద్యార్థులు చక్కటి ప్రతిభను కనబరిచి, 100% ఉత్తీర్ణతను సాధించి తమ సత్తాను చాటుకున్నారు. పదవతరగతిలో కె. రోహన్ రెడ్డి 471 / 500 తో అగ్రస్థానం, వి. సత్య రాఘవేంద్ర 468 / 500 తో ద్వితీయ స్థానం, ఎస్. శ్రీ తనూజ్ 465 / 500 తో తృతీయ స్థానంలో, ఎమ్. శివ సాత్విక్ 463 / 500 తో నాలుగో స్థానంలో, జి. సాయి వెంకట దుర్గా షణ్ముఖ్ 460 / 500తో ఐదవ స్థానంలో నిలిచారు. పన్నెండవతరగతి లో ప్రీతిప్ చౌదరి 419 / 500 తో అగ్రస్థానం, కె. అమృత హాసిని 404 / 500 తో ద్వితీయ స్థానం, మహిమ హాసిని 367 / 500 తో తృతీయ స్థానంలో నిలిచారు. విద్యార్థినీ విద్యార్థులు అందరినీ చైర్మన్ గ్రంధి బాబ్లీ, ప్రిన్సిపల్ శిరీష అభినందనలు తెలియజేసారు. గ్రీన్ఫీల్డ్ స్కూల్ అత్యుత్తమ ఫలితాలను సాధిస్తూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్న తమ పాఠశాల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు అందరికీ ప్రిన్సిపల్ శ్రీమతి శిరీష , చైర్మన్ శ్రీ గ్రంధి బాబ్లీ అభినందనలు తెలియజేసారు