

జనంన్యూస్. 17. నిజామాబాదు. ప్రతినిధి.
ప్రభుత్వం మాట నిలుపుకోకుంటే కూలీలతో రాష్ట్రవ్యాపితంగా తహసీల్దార్ కాయాలయాలను ముట్టడిస్తాం.
అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (ఏ.ఐ.పి.కే.ఎం.ఎస్.) రాష్ట్ర ప్రధానకార్యదర్శి పి. రామకృష్ణ వెల్లడి. ఆత్మీయ భరోసా కోసం రాష్ట్ర వ్యాప్తంగా తాహశీల్దార్ కార్యాలయాల ముట్టడికి వ్యవసాయ కార్మికులు సిద్ధం కావాలని, ప్రభుత్వం మాట నిలుపుకోకుంటే కూలీలతో రాష్ట్రవ్యాపితంగా తహసీల్దార్ కాయాలయాలను ముట్టడిస్తాం అని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (ఏ.ఐ.పి.కే.ఎం.ఎస్.) రాష్ట్ర ప్రధానకార్యదర్శి పి. రామకృష్ణ వెల్లడించారు. సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో శనివారం నాడు ఉపాధిహామీ కూలీలతో సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (ఏ.ఐ.పి.కే.ఎం.ఎస్.) రాష్ట్ర ప్రధానకార్యదర్శి పి. రామకృష్ణ మాట్లాడుతు. రెక్కడితే డొక్కాడని వ్యవసాయ కూలీలు బ్రతుకులు దినదిన గండం అర్ధాకలితో జీవిస్తున్న పరిస్థితి అన్నారు. ఒకవైపు వ్యవసాయ రంగంలో యాంత్రికరణ ఆధునీకరణ తో మరోవైపు బీహార్ పశ్చిమబెంగాల్ ఉత్తరప్రదేశ్ ఝార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి వలస కూలీలు వచ్చి వ్యవసాయం పనులు చేయడం వల్ల ఆరాకూర దొరికే కూలి పనులు కూడా ఇప్పుడు కూలీలకు దొరకలేని పరిస్థితి ఉందన్నారు. కూలీలు పనులు లేక హైదరాబాద్ వంటి నగరాల వైపు వలస పోయే దుస్థితి నెలకొన్నది అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పనులు లేకుండా కుట్రకు పూనుకుంటుందని అందులో భాగంగానే రాను రాను రాజు గుర్రం గాడిద అయినట్లు నిధులు పెంచుతూ పోవాల్సింది బడ్జెట్లో తగ్గించి నామం మాత్రం బడ్జెట్ తో కాలం వెల్లదిస్తున్నారు అన్నారు. అనేక కొరివి లు, కొత్త నిబంధనలు పెట్టి కూలీలు తమకు తాము గానే రాకుండా చేయడానికి కుట్ల పన్నుతున్నారన్నారు. కూలీలకు వేతనాలు 3,4 నెలలకు ఒకసారి ఇవ్వడం వల్ల కూలీలు తమ కుటుంబాలను ఎలా నడుపుకుంటారన్నారు.
ప్రతి నెల నెల డబ్బులు అందజేయాలని, కొలతలకు సంబంధం లేకుండా రోజువారీగా 600 రూపాయలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో భాగంగా వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12000 చొప్పున అందజేస్తామని ఇప్పుడు డబ్బులు లేవని దాటవేయడం సిగ్గుచేటు అన్నారు. సెంటు భూమి ఉండకూడదని, 20 రోజులు పోయినవారికే ఇస్తామని అడ్డంకులు పెట్టి ఇవ్వకుండా చేతులు దులుపుకుంటున్నారన్నారు. ప్రతి గ్రామంలో ఎంత మంది కూలీలు ఉంటే వాళ్ళందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 12000 లను కాలయాపన లేకుండా ఇవ్వాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా తహసిల్దార్ కార్యాలయం ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం మాట నిలబెట్టుకోకుంటే ప్రజాందోళనలను ఎదుర్కోవాల్సి ఉటుంది ఆయన గుర్తు చేశారు.
కార్యక్రమంలో సిపిఐ(ఎం. ఎల్.) మాస్ లైన్ జిల్లా నాయకులు ఆర్. రమేష్, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (ఏ.ఐ.పి.కే.ఎం.ఎస్.) జిల్లా ప్రధానకార్యదర్శి ఇ. రమేష్, ఉపాధ్యక్షులు బి. కిశోర్, జిల్లా సహాయ కార్యదర్శి జి. సాయిరెడ్డి, కోశాసధికారి ఎస్. కిశోర్, సిపిఐ(ఎం. ఎల్.) మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ నాయకులు ఆర్. దామోదర్, మండల నాయకులు ఎం. లింబాద్రి, ఎం. డి. అనిస్, ఎస్. గంగామణి, నిమ్మల. రాములు తూంపల్లి. భూమాగౌడ్, ఎస్ బాలయ్య, ఆనంద్, గొల్ల రాములు, చాకలి. పెద్ద గంగాధర్, బి. విజయ, ఎస్. రాజన్న తదితరులు పాల్గొన్నారు. ఈ. రమేష్ జిల్లా ప్రధానకార్యదర్శి అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (ఏ.ఐ.పి.కే.ఎం.ఎస్.) నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ.