Listen to this article

జుక్కల్ ఏప్రిల్ 17 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం పెద్ద గుల్ల గ్రామానికి చెందిన రాందేవ్ గారు కొన్ని రోజుల క్రితం గుండె పోటుతో మరణించారు.. విషయం తెలుసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు శనివారం రోజు వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.. అదేవిధంగా గుల్ల తండాకు చెందిన శంకబాయి(34) ఆమె కూతురు శివాణీ(14) రాత్రి నిద్రిస్తున్న సమయంలో కూలర్ కు కాలు తగలడంతో విద్యుత్ షాక్ కు గురై తల్లీ కూతుళ్లు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.. ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు శనివారం రోజు వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందించారు.. జరిగిన సంఘటన దురదృష్టకరమని మనోవేదన చెందారు.. కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇట్టి కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు జుక్కల్ మండల్ యూత్ అధ్యక్షుడు సతీష్ పటేల్, మాజీ సొసైటీ చైర్మన్ పదో పటేల్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు