

జనం న్యూస్. తర్లుపాడు మండలం. మే 17
తర్లుపాడు మండల కేంద్రమైన తర్లుపాడు, బీసీ ముతరాశి కాలనీలో పంచాయతీ నిధులతో నాయకులంతా కలిసి నూతన నీటి బోరుకు శంకుస్థాపన చేశారు. కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మండల సీనియర్ వైసీపీ నాయకులు మరియు మాజీ సర్పంచ్ సూరెడ్డి రామసుబ్బారెడ్డి, ఎంపీటీసీ వన్నె బోయిన అంకమ్మ, వైస్ సర్పంచ్ సత్యనారాయణరెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు కాలంగి శ్రీనివాసులు, ఈర్ల వెంకటయ్య, జనసేన నాయకులు వెలుగు పుల్లారావు వైకాపా శ్రేణులు పల్లెపోగు ప్రభాకర్,వి.. గాలెయ్య, వి. ఆంజనేయులు, వార్డు మెంబర్ వన్నెబోయిన నాగమణి మరియు బీసీ కాలనీ ప్రజలు పాల్గొన్నారు.