

జనం న్యూస్;17 మే శనివారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్:
కాలకుంట్ల వంశీధర్ రావు ఆధ్వర్యంలో, స్వాములకు పండ్ల భిక్ష, పాల భిక్ష కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మే 1, 2025న మార్కండేయ గుడి ముందు ప్రారంభించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నిర్వాహకులుగా బాలగోని గౌరీశంకర్ ,ఇప్పకాయల శ్రీహరి,రాజు, శ్రవణ్, శరత్, ఎయిర్టెల్ వెంకట్, పెద్ది మనోహర్, మూర్తి, శ్రీనివాస్, నగేష్ ,బాబా , బాలగొని లక్ష్మణ్ ,మోతే శ్రీనివాస్ పాలుపంచుకున్నారు. అదేవిధంగా, కేవీఆర్ ఫౌండేషన్ సభ్యులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ సేవ కార్యక్రమం మాలధారుల సేవా తాత్పర్యాన్ని ప్రతిబింబిస్తూ, భక్తి భావనను కలిగించేలా కొనసాగినందుకు సమాజం తరఫున ప్రశంసలు వ్యక్తమయ్యాయి.