

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 17 రిపోర్టర్ సలికినీడి నాగరాజు
ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం చిలకలూరిపేట సమన్వయకర్త తోట రాజారమేష్ ఆధ్వర్యంలో జనసేనపార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని పట్టణములోని రజక కమ్యూనిటీ హాల్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాదె వెంకటేశ్వరరావు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీలోని ప్రతి కార్యకర్తకు అండగా వుంటున్నారని, నీతి నిజాయితీలతో పార్టీ నడిపిస్తున్న గొప్ప నాయకుడు అని అన్నారు.అనంతరం క్రియాశీలక కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు, క్రియాశీలక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.