Listen to this article

జనం న్యూస్ మే 17 నడిగూడెం

మండలం లోని సిరిపురం సబ్ స్టేషన్ పరిధిలో అత్యవసర మరమ్మత్తుల కారణంగా ఆదివారం పలు గ్రామాల్లో కరెంట్ సరఫరాను నిలిపివేయనున్నారు. ఉ.08 గంటల నుంచి 12 గంటల వరకు సిరిపురం, శ్రీరంగాపురం,వల్లాపురం గ్రామాల్లో కరెంట్ ఉండదని విద్యుత్ ఏఈ కె.సైదయ్య శనివారం ఒక ప్రకటన లో తెలిపారు. కావున వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి, తమకు సహకరించాలని ఆయన కోరారు.