

బిచ్కుంద ఏప్రిల్ 17 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ
కాంతారావు గారు శంకుస్థాపన చేసి లబ్ధిదారులకు
మంజూరు పత్రాలు అందజేశారు..
ప్రజా ప్రభుత్వం ఇళ్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలనే ధృడ సంకల్పంతో పని చేస్తుందని,
అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్లికార్జున్ అప్ప కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగాధర్ విఠల్ రెడ్డి , మార్కెట్ కమిటీ చైర్మన్ కవిత, అశోక్ ,గౌస్, వెంకట్ రెడ్డి, ఖలీల్ ,భాషా సెట్, యోగేష్ బండు పటేల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
