Listen to this article

నర్సరీల్లో మొక్కల సంరక్షణకు శ్రద్ధ వహించాలి

నర్సరీలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

వేసవిలో మొక్కలు ఎండిపోకుండా ఎప్పటికప్పుడు నీటిని అందించాలి

జెడ్పీ డిప్యూటీ సీఈవో శిరీష

జనం న్యూస్ మే 18 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ )

గ్రామాల్లో నర్సరీలో మొక్కల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని,నర్సరీల్లో మొక్కలను జాగ్రత్తగా పెంచాలని,వేసవిలో మొక్కలు ఎండిపోకుండా ఎప్పటికప్పుడు నీటిని అందించాలని జెడ్పీ డిప్యూటీ సీఈవో శిరీష అన్నారు. శనివారం మునగాల మండల పరిధిలోని పలు గ్రామాల్లో నర్సరీలను పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..మొక్కలకు ఎప్పటికప్పుడు నీళ్లు పోస్తూ ఏపుగా పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.ఎండలు ఎక్కువైనందున నర్సరీల్లో మొక్కలకు ఉదయం, సాయంత్రం రెండు సమయాల్లో నీటిని అందించాలని నర్సరీల నిర్వహకులకు సూచించారు. ఎండల నుండి మొక్కలను కాపాడేందుకు షెడ్ నెట్ లను ఏర్పాటు చేసుకోవాలని, మొక్కల సంరక్షకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఏవైనా మొక్కలు ఎండిపోతే తక్షణమే వాటి స్థానంలో కొత్త మొక్కలను సిద్ధం చేయాలన్నారు.నర్సరీలో మొక్కల పెంపకంలో అలసత్వం చూపొద్దని, నిర్దేశించిన లక్ష్యం మేరకు నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేయాలన్నారు.నర్సరీలపై షెడ్‌నెట్లను మొక్కలకు గాలి తగిలేలా ఏర్పాటు చేయాలని సూచించారు.