Listen to this article

భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు

భద్రాచల తలంబ్రాలు అందుకున్న హనుమాన్ స్వాములు

జనం న్యూస్, మే 18 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)

రామ నామమే శాశ్వతమని ప్రతి ఒక్కరూ రామ నామాన్ని లిఖించాలని శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు అన్నారు. శనివారం నాడు ప్రజ్ఞాపూర్ లోని పార్థివేశ్వర స్వామి దేవాలయంలో భద్రాచల రామయ్య ముత్యాల తలంబ్రాల విశిష్టత, వాటి పవిత్రత తెలియజెసి హనుమాన్ స్వాములకు అందజేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతు రామనామ స్మరణ చేస్తే ఆనందం లభిస్తుందన్నారు. ఆ నామంలో ఉన్న మంత్రశక్తి మనలో దుఃఖాల్ని సమూలంగా నాశనం చేసి ఆనందాన్ని ఇస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ రామ నామాన్ని లిఖించి తరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మెతుకు నర్సింలు, గుంటుకు శ్రీను, లక్ష్మణ్, ప్రసాద్, భక్తులు పాల్గొన్నారు.