

ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటించాలి
ప్రతి ఒక్క వాహనదారులు రహదారి భద్రత నియమాలు పాటించాలి
ఎస్సై ప్రవీణ్ కుమార్
జనం న్యూస్ మే 19 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-
వాహనదారులు ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలను పాటించాలని, డ్రైవింగ్ చేసే సమయంలో ఇంటివద్ద కుటుంబ సభ్యులు తమ కోసం ఎదురుచూస్తారని గుర్తుంచుకుని ముందుకు సాగాలని మునగాల మండల ఎస్సై ప్రవీణ్ కుమార్ ఆదివారం మండల ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….
వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను తప్పకుండా పాటించాలని అన్నారు. మద్యం సేవించి, సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసి తమ విలువైన ప్రాణాలను తీసుకోవద్దన్నారు.ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని,కారు నడిపేవారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని, వాహనాల నడిపే ప్రతి ఒక్కరూ అన్ని ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండి మద్యం సేవించకుండా రహదారి భద్రతా నియమాలు పాటించి వాహనాలు నడపాలని సూచించారు.వాహనదారులు చేసే చిన్న చిన్న తప్పిదాలు వారి జీవితాలను తలకిందులు చేస్తాయన్నారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను పాటించడం బాధ్యతగా భావించాలన్నారు.