

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 18 రిపోర్టర్ సలికినీడి నాగరాజు
పట్టణములోని మున్సిపల్ కార్యాలయం జరిగిన రూ.34 లక్షల కుంభకోణం లో తనకు సంబంధం లేదని మున్సిపల్ ఛైర్మన్ రఫాని తెలిపారు. శనివారం పట్టణ ములోని మున్సిపల్ కార్యాలయంలో తన ఛాంబర్ లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ( స్కామ్) కుంభకోణంపై పూర్తిస్థాయి విచారణ జరపాలని ముందే ఆదేశించానన్నారు. ఇప్పటికే పది మంది ఉద్యోగులను సస్పెండ్ చేశారని, ఐదుగురిని ప్రభుత్వానికి అటాచ్ చేశారని ఆయన తెలిపారు. నిజాలు త్వరలోనే వెల్లడవుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మురకొండ మల్లిబాబు, షేకు ఆజార్ తోపాటు పలువురు ఉన్నారు.