

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 18 రిపోర్టర్ సలికినీడి నాగరాజు
బోప్పూడి గ్రామ పరిదిలోని HP పెట్రోల్ బంక్ వెనుక గల ఖాళీ స్థలంలో పార్క్ చేసి వున్న టిప్పర్ లారీ యొక్క రెండు బ్యాటరీలును దొంగతనం చేసినట్లు నాదెండ్ల మండలం, గణపవరం గ్రామానికి చెందిన మలిశెట్టి శ్రీనివాసరావు చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయగా చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్ SI అయిన G. అనిల్ కుమార్ కేసు నమోదు చేసి రెండు గంటల వ్యవదిలో ముద్దాయిలు అయిన 1]. సయ్యద్ బాబు s/o [లేటు] అబ్బు @ అబ్దుల్లా, 33 సం., కులం ముస్లిం, పోలేరమ్మ గుడి వద్ద, మిలటరీ కాలనీ, ఒంగోలు పట్టణం.2]. షేక్ ఆసిఫ్ బాషా ఆసిఫ్ s/o నాగూర్ మీరా వలి, 21 సం., c/ముస్లిం, నడిగడ్డపాలెం గ్రామం, చుండూరు మండలం, గుంటూరు జిల్లా. ప్రస్తుతం పోలేరమ్మ గుడి వద్ద, మిలటరీ కాలనీ, ఒంగోలు పట్టణం అను వారిని చిలకలూరిపేట మండలం, రామచంద్రాపురం గ్రామ పరిదిలోని NH-16 ఫ్లై ఓవర్ క్రింద అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 50,000/- విలువ గల రెండు ఎక్సిడ్ బ్యాటరీలను స్వాదీనం చేసుకొన్నారు. ముద్దాయిలు ఇద్దరినీ చిలకలూరిపేట AJCJ కోర్టులో హాజరుపర్చగా వారిని 15 రోజుల రిమాండ్ కు పంపినారు. సయ్యద్ బాబు పై ఒంగోలు తాలుకా, చీమకుర్తి, టంగుటూరు పోలీస్ స్టేషన్ లలో దొంగతనం కేసులు మరియు గంజాయి కేసు వున్నది. అదేవిధంగా ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ నందు suspect షీటు కూడా వున్నది