Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 18 రిపోర్టర్ సలికినీడి నాగరాజు

బహుజన సంకల్ప సభ విజయవంతం

రానున్న స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా సంకల్ప సభలు బీఎస్పీ ఏపీ చీఫ్ బందెలగౌతం కుమార్

ముందుగా మహాత్మ జ్యోతిరావు పూలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల చేసి పట్టణంలో ర్యాలీ నిర్వహించిన బీఎస్పీ శ్రేణులు

బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బందరు గౌతం కుమార్ నాయకత్వంలో బహుజనులకు రాజ్యాధికారం లక్ష్యంగా హిందూపురం నుండి ఇచ్చాపురం వరకు అన్ని జిల్లాల్లో బహుజన సంకల్ప సభ నిర్వహించడం జరుగుతుంది ఈరోజు నరసరావుపేటలో ప్రకాష్ నగర్ లోని షాదీ ఖనలో బహుజన సంకల్ప సభ నిర్వహించడం జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బందరు గౌతం కుమార్ హాజరయ్యారు సభధ్యక్షులుగా బీఎస్పీ పల్నాడు జిల్లా అధ్యక్షులు బూదాల బాబురావు వ్యవహరించారు ఈ సందర్భంగా గౌతం కుమార్ మాట్లాడుతూ ఈ దేశంలో నోటికి 85% మంది ఉన్న బహుజనులు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారని ఈ రాష్ట్రంలో నూటికి 41/2 శాతం ఉన్న రెడ్లు మూడు శాతం ఉన్న కమ్మలు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని బహుజనుల మధ్య అంతరాలు సృష్టించి వారు అందలమెక్కుతున్నారని ఈ రాష్ట్రంలో ఉన్న భూములు ఫ్యాక్టరీలు సినిమా రంగాలు ఈ రాష్ట్ర సంపద మొత్తం ఈ రెండు కులాల హక్కుగా పంచుకుంటున్నారని 85 శాతం ఉన్న బహుశాలను రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారని ఈ దేశంలో బహుజనులకు రాజ్యాధికారం పార్టీ బహుజన సమాజ్ పార్టీ అని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని గ్రామాల నుండి బీఎస్పీ పోటీ చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా ఇన్చార్జి తమ్ములూరి వెంకయ్య నరసరావుపేట నియోజకవర్గం అధ్యక్షులు వినుకొండ అధ్యక్షులు మాస్ ఏసోబు నరసరావుపేట నియోజకవర్గం ఇంచార్జ్ ఆవుల మణికంఠ రామచంద్ర రమేష్ బి వి ఎఫ్ జిల్లా నాయకులు బూదాల సామ్యూల్ రొంపిచర్ల మండల అధ్యక్షులు బందరు దానియేలు నరసరావుపేట పట్టణ అధ్యక్షులు జంగాల కిషోర్ కుమార్ వినుకొండ నాయకులు మంద సురేష్ పూనూర్ జాన్సన్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు దానమ్మ జిల్లా సోషల్ మీడియా ఇన్చార్జి జయ రాజు బీసీ సమన్వయ కమిటీ చైర్మన్ అంకమ్మ రావు నాగేశ్వరరావు చక్రవర్తి వెంకట్రావు దాసు మరియు బీఎస్పీ కార్యకర్తలు పాల్గొన్నారు