

విజయవంతమైన హెల్త్ క్యాంప్
జనం న్యూస్,మే19,జూలూరుపాడు:
మండల కేంద్రంలోని సాయి ఎక్స్లెంట్ స్కూల్ ఆధ్వర్యంలో ఖమ్మం సురక్ష హాస్పిటల్ యాజమాన్యం చే మెగా హెల్త్ క్యాంప్ ఆదివారం నాడు నిర్వహించారు.ఈ హెల్త్ క్యాంప్ లో సుమారుగా 450 మంది అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆర్తో డాక్టర్ తక్కలపల్లి వరుణ్ కన్సల్టెంట్స్ ఫిజీషియన్, డాక్టర్ రుద్ర గౌతమ్ రమేష్ మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్య వంతులుగా జీవించాలి అనే లక్ష్యంతో ఖమ్మం సురక్ష హాస్పిటల్ ఆధ్వర్యంలో గ్రామీణ పేద అనారోగ్యాలకు వైద్య సేవలు అందించే లక్ష్యంగా తమ కృషి నిరంతరం కొనసాగుతుందని వారు తెలిపారు, ఆరోగ్య సేవలను ప్రజలు అందుకొని ఆరోగ్యవంతులుగా జీవించాలని వారు పేర్కొన్నారు. ఈ హెల్త్ క్యాంప్ లో ఎమ్మెస్ డాక్టర్ అనిల్ కుమార్(చెవి ,ముక్కు,గొంతు),డాక్టర్.ఎల్ అప్పి రెడ్డి, డాక్టర్ భరత్ కుమార్ సాయి, ఎక్స్లెంట్ స్కూల్ కరస్పాండెంట్ అరే బోయిన హుస్సేన్,సాయి ఎక్స్లెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ కె,పి ఆర్ఎంపి ప్రవల్లిక, సిహెచ్ గోపికృష్ణ,సాయి ఎక్సలెంట్ స్కూల్ డైరెక్టర్ శివ కుమారి,ఉపాధ్యాయులు నబీన,నవ్య,ప్రశాంతి, నాగరాజు,సత్యవతి, శాంతమ్మ ,పావని,ఏ సరిత,కళ్యాణి,మాజీ జడ్పిటిసి సభ్యులు దొండపాటి రమేష్, సిపిఐ మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు,ఏ ఐ వై ఎఫ్ జిల్లా నాయకులు ఎస్.కె చాంద్ పాషా జిల్లా రైతు సంఘం నాయకులు ఎల్లంకి మధు, సురక్ష హాస్పిటల్ మేనేజర్ సైదులు, పి ఆర్ ఓ సునీల్, సురక్ష హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
