

జనం న్యూస్ 19 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం జిల్లాలో 13,751 మంది ఎయిడ్స్ బాధితులను గుర్తించామని సంబంధిత అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వీరిలో 6,471 మంది మందులు వాడుతున్నారని పేర్కొన్నారు.
గడిచిన 20 ఏళ్లలో సుమారు 5,595 మంది ఎయిడ్స్తో మరణించారన్నారు. జిల్లాలో 2 ఆర్ట్ కేంద్రాలు, పలు స్వచ్చంద సంస్థలు రోగులకు సేవలు అందిస్తున్నాయన్నారు. బాధితుల పట్ల వివక్ష చూపించరాదని పిలుపునిచ్చారు.