

జనం న్యూస్,మే19
అచ్యుతాపురం: 21 ఏళ్ల క్రితం ఎం. జగన్నాధపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం వేర్వేరు ప్రాంతాలకు వెళ్లిపోయారు. 1999-2004 వరకు చదివిన విద్యార్థుల ఆత్మీయ సమావేశం పాఠశాలలో సందడిగా సాగింది. ఇటీవల మృతి చెందిన సహచర మిత్రుడు వర్మ,శివ,నాగరాజు, శ్రీనమ్మలకు నివాళులర్పించారు. ముందుగా స్కూల్ ఆవరణలో ఉన్న సరస్వతి దేవి విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.తమకు విద్యాబుద్ధులు నేర్పించి తమ ఉన్నతికి బాటలు వేసిన అప్పటి గురువులు శ్రీనివాసరావు,నరసింహ రాజు, లక్మి నారాయణ, సత్తిబాబు మాస్టారలను వెండి షిల్డ్,శాలువాలు, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సత్కరించారు. ఈ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆనందంగా పలకరించు కున్నారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆనాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నారు. ఈకార్యక్రమంలో కృష్ణ వేణి, కాంతి,చిట్టి, లక్మి, అరుణ, వేణు, చిరంజీవి, శ్రీను, నాగేష్, రమేష్, కాసు,లక్ష్మణ,నూకేష్, శివాజీ తదితరులు పాల్గొన్నారు.