Listen to this article

(జనం న్యూస్ మే 20. చంటి)

దౌల్తాబాద్ మండల స్థాయిలో ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల దౌల్తాబాద్ లో రేపటినుండి ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం జరుగుతుందని మండల విద్యాధికారి తెలిపారు ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి మాట్లాడుతూ జిల్లా స్థాయిలో శిక్షణ పొందినటువంటి రిసోర్స్ పర్సన్ల ద్వారా మండల స్థాయిలో ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వబడుతుంది ఇట్టి శిక్షణ కార్యక్రమం ఉపాధ్యాయునిలోని నైపుణ్యాలను పెంపొందించడానికి వినూత్నమైన రీతిలో బోధించడానికి సమాజానికి మార్పు కనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడానికి ఇట్టి శిక్షణ ఉపయోగపడుతుందని సూచించారు. ఇట్టి కార్యక్రమాలను జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి అధికారులు కూడా సందర్శించే అవకాశాలు ఉన్నాయని శిక్షణ కార్యక్రమం సమయానుకూలంగా క్రమశిక్షణగా నిర్వహించాలని రిసోర్స్ పర్సన్ లకు సూచించారు ఈ కార్యక్రమంలో మండల రిసోర్స్ పర్సన్స్ త్యాగరాజు సర్దార్ హుస్సేన్ శివకుమార్ వేణుగోపాల్ అదేవిధంగా సి ఆర్ పి లు రాజు కుమార్ నగేష్ మండల మల్లేశం పాల్గొన్నారు.