

జనం న్యూస్,మే19, జూలూరుపాడు:
విధులలో భాగంగా బదిలీలపై వెళ్తున్న పోలీస్ స్టేషన్ సిబ్బందిని జూలూరుపాడు ఎస్సై బాదావత్ రవి సన్మానించారు. సుదీర్ఘకాలంగా జూలూరుపాడు పోలీస్ స్టేషన్లో విశేషమైన సేవలందించిన హెడ్ కానిస్టేబుల్ అజ్మీర బుచ్చయ్య నాయక్, మహిళ కానిస్టేబుళ్లు శైలజ, సౌజన్యలను శాలువలతో సత్కరించి, బహుమతులు అందచేశారు. విధులలో భాగంగా ప్రతి ప్రభుత్వ ఉద్యోగి బదిలీ పై వెళ్ళటం తప్పనిసరి అందులో భాగంగా మీరు కూడా వెళ్ళిన చోట ప్రజల మన్ననలు,అధికారి మన్ననలు పొంది పోలీస్ స్టేషన్ కు,పోలీస్ శాఖకు మంచి పేరు తో ఉన్నత పదవులకు చేరాలని అభినందనలు తెలిపారు.ఈ సన్మాన కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.