

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరు, తేదీ 20 – 5 – 25: ఇటీవల పరమపదించిన చెంగారి సాయి ప్రసన్న కుమారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అరవపల్లి లోని స్థానిక గీతా మందిరం ఆవరణమునందు ఇవాళ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చెంగారి రామాంజనేయులు మరియు కుటుంబ సభ్యుల ఔదార్యంతో పేదలకు అన్న వితరణ చేయటం జరిగింది. ఈ సందర్భంగా పేదవారి ఆకలి తీర్చటం సాటి మానవ ధర్మం అని, పెళ్లి లేదా పుట్టినరోజులు మరియు కుటుంబ పెద్దలను సంస్మరణ చేసుకునే సందర్భాలలో అభాగ్యులైన సాటి మానవులను తమ వంతు ప్రయత్నం గా ఆదుకునే కార్యక్రమాలను చేయటానికి ప్రతి ఒక్కరూ దాతృత్వం అలవర్చుకోవాలని ఇది హైందవ ధర్మం మనకు నేర్పిన జ్ఞానం అని మన్నెం రామమోహన్, SI తెలియజేశారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కుర్రా మణి యాదవ్, చెంగారి రామాంజ నేయులు, నాయన పల్లి జయన్న, రిటైర్డ్ తహసిల్దార్, జంగం శెట్టి హరిబాబు, కొత్తపల్లి గంగాధర్ ఆచారి, HD ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు