

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 20 రిపోర్టర్ సలికినీడి నాగరాజు
బెదిరింపులు మానుకుని కొనుగోళ్లని వెంటనే ప్రారంభించాలి అన్ని రైతు సంఘాల నాయకుల డిమాండ్
ఉత్తర భారస్థ దేశ రైతులను పొగాకు రైతులు ఆదర్శంగా చేసుకోవాలని పి లుపు నిచ్చారు
సిపిఎం కార్యాలయంలో అన్ని రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్య క్రమంలో పలు నిర్ణయాలు
చిలకలూరిపేట
పెద్దన్న పాత్ర పోషిస్తున్న ఐటీసీ కంపెనీతో పాటు అన్ని కంపెనీలు రైతుల వద్ద ఉన్న పొగాకు మొత్తం కొనుగొలు చెయ్యాలని పట్టణంలో ఎన్. ఆర్.టి సెంటర్ వద్ద గల ఐటీసీ కంపెనీ వద్ద ఈ నెల 27వ తారీఖున నిరా హార దీక్ష చేయబోతున్నట్లు అన్ని రై తు సంఘాల నాయకులు మంగళ వారం నాడు నిర్ణయించారు. స్థానిక రెండవ లైన్ పండరీ పురంలో గల సిపిఎం కార్యాలయంలో జరిగిన దేశ వ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక సమ్మె వాయిదా పడిన సందర్భముగా జరిగిన నిరసన కార్యాక్రమానికి కౌ లు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై. రాధా కృష్ణ అధ్యక్షత వహించి మాట్లాడుతూ దేశవ్యాప్త సార్వత్రి క సమ్మె వాయిదా పడిన సందర్భంగా ఈ నిరసన కార్యక్రమం నిర్వహించామన్నారు వ్యవసాయ సీజన్ ప్రారంభమౌతున్న రైతుల వద్ద నుంచి కే జీ పొగాకు ఏ కంపెనీలు కొనకపోవడం దురదృష్ట కరమన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఒక చిలకలూరిపేట నియోజకవర్గంలోనే లోనే ఎక్కువ మంది ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ చిన్న సన్నకారు,కౌలు రైతులు పొగాకును పండించారని ముందస్తు ప్రణాళిక వ్యవసాయ శాఖ దగ్గర లేక పోవడం వల్ల,రైతులు ఆతహత్యాల కు పాల్పడు తున్నారన్నారు. ఇప్పటికైనా కనీ స మద్దతు ధరల గ్యారెంటీ చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రులు కంపెనీల చేత కొనిపిస్తామని చెప్పి జాడ,జావాబు ఇంత వరకు లేదన్నారు.ప్రభుత్వం వెంటనే ప్రత్యేక నిధులను కేటాయించి కొనుగోలు చేయాలన్నారు. ఈ సందర్భంగా నల్లమడ రైతు సంఘం అధ్యక్షులు కొల్ల రాజ మోహన్రావు మాట్లాడుతూ పోగాకు కొనుగోలు సమస్య తీవ్రంగా ఉందని ప్రభుత్వం దీని వెంటనే పొగాకు బోర్డు పరిధిలోకి తేవాలన్నారు. అమెరికా యూరప్ లాంటి దేశాలలో సిగరెట్టు తయారీకి నల్ల బర్లీ పొగాకు ఘాటు వాసన తదితర విషయాల్లో ముఖ్యపాత్ర వహిస్తుందన్నారు. కాబట్టి కంపెనీలన్నీ సిండికేట్ అయ్యి ప్రపంచ ఖ్యాతి గాంచిన బర్లీ పొగాకును తక్కువ రేట్లకు మధ్యవర్తుల ద్వారా కొనుగోలు చేసే విదంగా పొగాకు రైతులను కంపెనీలు దెబ్బ తీస్తున్నాయన్నారు. ఇప్పటికైనా ఉత్తర భారతదేశ రైతు ఉద్యమాలను దృష్టిలో పెట్టుకొని పొగాకు కొనుగోలు చేసే కంపెనీల వద్ద నిరసన కార్యక్రమాలు చేయాలన్నారు. దానికి అనుగుణంగా ప్రణాళికను సిద్ధం చేయలన్నారు. ప్రభుత్వ విధి విధానాలు సక్రమంగా లేకపోవడం వల్ల అన్ని పంటలకు ధరలు ఈ సంవత్సరం తగ్గాయన్నారు.గతంలో రెండు మూడు ఎకరాలు వేసి కౌలు రైతులు కం పెనీల మాటలు విని 10,15ఎకరాల దాకా కౌలుకు తీసుకొని వేసి తీవ్ర ఇ బ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు కేటాయించి పొగ కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సరలీకృత ఆర్థికవిదానాలు పీవీ నరసింహారావు ప్రభుత్వ హయాం లోనే వచ్చాయన్నారు. అప్పుడే జాగ్రత్త పడక పోవడం దురదృష్ట కరమన్నారు. సీపీఐ ఏరియా కార్యదర్శి తాళ్లూరి బాబురావు, సిఐటియు మం డల కార్యదర్శి పేరుబోయిన వెం కటే శ్వర్లు మాట్లాడుతూ గ్రామలోని కౌలు రైతులు వారుపడే ఇబ్బందు వారికి తెలియజేసే విధంగా ప్రణాళికలు చేయాలన్నారు. సిపిఐ మహిళా సంఘ నాయకురాలు నిర్మల మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే విధానాల వల్ల కార్మిక సంఘాలు, రైతులు నిర్వీర్యమై పోతున్నారన్నారు. ఉపాధి హామీకి కూలీలు పెరుగుతున్నారని ఉపాధి హామీకి మాత్రం నిధులు కేంద్ర ప్రభుత్వ తగ్గిస్తుందన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం చిలకలూరిపేట అధ్యక్షులు సాతులూరి లూథర్ మాట్లాడుతూ వ్యవసాయ కూలీలు రైతులుగా మారారన్నారు. వారిని కంపెనీలు ఆశపెట్టి ప్రోత్సహించి కొనక పోవడం దురదృష్టకరమన్నారు. ఏఐటీయూసీ ఏరియా కార్యదర్శి దాసరి వరహాలు మాట్లాడుతూ ప్రస్తుతం అమలు కాబోతున్న నాలుగు లేబర్ కోట్ల చట్టం అమలుఅయితే సంఘాలు నిర్మించుకోవడం కష్టతరమవుతుందన్నారు. 8 గంటల పని విధానం పోయి 12 గం.పని విధానం వచ్చే ప్రమాదం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ నియోజ కవర్గ ఇన్చార్జి ఎం రాధాకృష్ణ మాట్లా డుతూ కమ్యూనిస్టు పార్టీలు చేసే ఎ టువంటి ఉద్యమానికైనా తమ పార్టీ పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు ఉంటాయన్నారు. పొగాకును పొగ ఆకుగా మార్చారన్నారు. ఇప్పటికైనా కంపెనీలు స్పందించి రైతు వద్ద ఉన్న పొగాకును పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో AIYF జిల్లా కార్యదర్శి షేక్ సుభాని,ఏరియా కార్యదర్శి మల్లికార్జున్, ఐద్వా పట్టణ పి.భారతి, sfi పట్టణ అధ్యక్షులు పి శివ గణేష్,మున్సిపల్ యూనియన్ నాయకులు అంజయ్య, తదితరులు పాల్గొన్నారు