

జనం న్యూస్ మే 21 కూకట్పల్లి జోన్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి
కూకట్పల్లి నియోజకవర్గ సమస్యలపై కూకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ తో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో సమావేశం అయ్యారు. రానున్న వర్షాకాలంను దృష్టిలో పెట్టుకొని నాలాల విస్తరణ పూడిక తీత పనులు వెంటనే చేపట్టి వరద ముంపు ప్రాంతాలను నుండి ప్రజలను రక్షించాలని జెడ్సీని కోరారు. గత సంవత్సరం కూడా అధిక వర్షాలు వరదలు మూలంగా నాలాల విస్తరణ చేపట్టని కారణంగా అల్లాపూర్ బాలానగర్ పరిసర ప్రాంతాలన్నీ వరద పోటెత్తి ప్రజలు చాలా ఇబ్బందులు గురయ్యారని జెడ్ సి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సంవత్సరం అలా కాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు అదేవిధంగా నగరంలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో కూకట్పల్లి ఒకటనీ దీన్ని దృష్టిలో ఉంచుకుని రహదారి విస్తరణ పనులు వెంటనే చేపట్టి ట్రాఫిక్ రద్దీనీ క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉందన్నారు ఆయా పనుల అభివృద్ధికి నిధుల కేటాయింపు విషయంలో ఎలాంటి లోటు లేకుండా చూడాలన్నారు. సమస్యల పరిష్కారంలో చర్చి సానుకూలంగా స్పందించినట్లు రమేష్ పేర్కొన్నారు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ లక్ష్మయ్య కూడా ఉన్నారు.