Listen to this article

జనం న్యూస్ మే 20:నిజామాబాద్ జిల్లా

ఏర్గట్ల మండలకేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ నెల 20వ తేదీ నుండి 24వ తేది వరకు ఐదు రోజులపాటు అన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులతో పాటు ఉపాధ్యాయులు కూడా పాల్గొంటారని మండల విద్యాధికారి బి. ఆనంద్ రావు తెలిపారు. ఈ సందర్బంగా విద్యాధికారి మాట్లాడుతూ ఈ శిక్షణ ఉపాధ్యాయులకు ఎంతో మేలు కలుగుతుందని త ద్వారా ప్రభుత్వ పాఠశాలలుకూడ అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని, గణిత సంబందిత మౌలిక అభ్యసన సామర్థ్యల పెంపుకు ఉపయోగపడుతుందని అన్నారు. ఈ శిక్షణలో తీసుకోవలసిన మెలకువలు, శిక్షణ యొక్క ప్రాముఖ్యతను ఉపాధ్యాయులందరికి తెలియజేసే వారిలో ఉత్తెజాన్ని నింపారు. జూన్ నెలలో చేపట్టబోయే బడి బాట కార్యక్రమం ద్వారా పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచుతూ పాఠశాల అభివృద్ధి పథములో నడిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సి ఆర్ పి లు మహేందర్, గంగప్రసాద్ పాల్గొన్నారు.