

జనం న్యూస్ మే 20 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి తనపై వచ్చిన అభియోగాలను తిప్పి కొట్టారు. రాజకీయ పరమైన కుట్రలో భాగంగానే తనను లక్ష్యంగా చేసుకొని బురద జల్లే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. మంగళవారం మీడియాకు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, నాపై వస్తున్న ఆరోపణలు అసత్యం, అసంబద్ధమైనవిగా తేలతాయన్నారు. చట్టం అందరికీ సమానమేనని, లీగల్ టీం పర్యవేక్షణలో న్యాయపరంగా ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. పార్టీ అభివృద్ధి కోసం తాను చేస్తున్న కృషి చేస్తూ… తాను కూడా ఎదుగుతున్నానని.. కొంతమంది నాయకులు అసూయతో కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. పార్టీలో నా ఎదుగుదల, ప్రజల ఆదరణ కొంతమందికి ఇష్టం లేకపోవడం వల్లే ఈ అపవాదులు సృష్టిస్తున్నానన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ పరువునే చెడగొట్టే ప్రయత్నం, అని ఆయన విమర్శించారు. అన్ని విషయాలు కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దలు గమనిస్తున్నారని గుర్తించుకోవాలన్నారు.
నాకు ప్రజలే నా బలం. తాను పెట్టిన కేసులకు రాజీమార్గం చూపించి, అదే సమయంలో తనపై అప్రతిష్ట కలిగించేలా కేసులు పెట్టించడాన్ని ప్రజలు, పార్టీ నాయకులు గమనిస్తున్నారని తెలిపారు. నన్ను పార్టీకి దూరం చేయాలనే కుట్రలు సాగవన్నారు. కూకట్పల్లిలో పార్టీని మరింత బలంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం అని చెప్పారు.1999 నుంచే కాంగ్రెస్ పార్టీతో ఉంటూ, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తున్నానన్నారు. ఇటీవలి కాలంలో పార్టీలో చోట మోటా నాయకులు కొత్తబిచ్చగాళ్లు మాదిరిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
నేను 1999లో 19 ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి వచ్చాను. అప్పటి నుండి ఇప్పటి వరకు అనేక ఒడిదొడుకులు చూశాను. ప్రస్తుతం కొంతమంది పక్క రాష్ట్రాల నుండి వచ్చిన కొత్త బిచ్చగాళ్లు మాదిరిగా ఇక్కడ రాజకీయాలు చేస్తూ కనబడుతున్నారని విమర్శించారు. వారి తీరు ఇప్పటికైనా మార్చుకోవాలని హితవు పలికారు. న్యాయపరమైన అంశం… లీగల్ టీం వివరించనుంది… ఈ విషయం ఇప్పటికే కోర్టు పరిధిలో ఉందన్నారు. అందుకే దీనిపై అంతకన్నా ఎక్కువగా మాట్లాడడం అవసరం లేదన్నారు. మరో రెండు మూడు రోజుల్లో మా లీగల్ టీం పూర్తి వివరాలను మీడియాకు తెలియజేస్తుందని వివరించారు.