Listen to this article

జనం న్యూస్ మే 20 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి

భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతీ పుష్కరాలకు వెళ్లే భక్తులు తప్పకుండా కమలాపురం క్రాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఉచిత అన్న ప్రసాదాలను సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గత ఆరు రోజుల నుండి వివిధ స్వచ్ఛంద సంస్థలు, దాతల సహకారంతో నిర్వహిస్తున్న ఉచిత అన్నదాన ప్రసాదాలను భక్తులకు ఎమ్మెల్యే వడ్డించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. సోలీస్ ఐకేర్ హాస్పిటల్ హైదరాబాద్ దాతల సహకారంతో ఉచిత అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన వారిని అభినందనీయమన్నారు. గత ఆరు రోజుల నుండి ఉచిత అన్న ప్రసాదాలను ప్రతిరోజు సుమారు రెండు వేల మందికి అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉచిత అన్న ప్రసాదాలను 26వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలకు వచ్చిపోయే భక్తులు కమలాపూర్ క్రాస్ రోడ్డు దగ్గర ఆగి భోజనం చేయాలని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం అక్కడున్న అధికారులు, భక్తులతో కలిసి ఎమ్మెల్యే భోజనం చేశారు….