

ఉపాధ్యాయులు వృత్యంతర శిక్షణను వినియోగించుకోవాలి
ఉపాధ్యాయులు విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలి
మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు
ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్తు ఉంటుందని, ప్రతి ఉపాధ్యాయులు వృత్యంతర శిక్షణలో అందిస్తున్న విషయాలను ఆకలింపు చేసుకుని తరగతి గదుల్లో విద్యార్థులకు అర్థమయ్యేలా సులభంతర బోధన విధానాలు అమలు చేయాలని మునగాల మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు అన్నారు. మునగాల మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ లో మంగళవారం మండల పరిధిలోని ఎస్.జి.టి ఉపాధ్యాయులందరికీ ఐదు రోజుల వృత్యంతర శిక్షణను ప్రారంభించి మాట్లాడారు..విద్యార్థుల కనీస సామర్థ్యాలను సాధించడానికి వివిధ బోధనా పద్ధతులను సమ్మిళితం చేస్తూ బోధన చేయడం వల్ల ఇట్టి సామర్థ్యాల సాధన జరుగుతుందని ఆయన అన్నారు.ఉపాధ్యాయులో వృత్యంతర శిక్షణ మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన బోధనా పద్ధతులను జోడించి సులభతరంగా విద్యార్థులకు అర్థమయ్యేలా ఈ శిక్షణ ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.