

జనం న్యూస్ మే 20 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి
ప్రజలందరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని, శ్రీరామభక్తుడైన హనుమాన్ ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆకాంక్షించారు. ఈరోజు మంగళవారం గణపురం మండల కేంద్రంలోని గణపసముద్రం చెరువు కట్టపై కొలువుదీరిన శ్రీ దక్షిణముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయుడు బోనాల రాజమౌళి – ఉమాదేవి దంపతుల ఆధ్వర్యంలో గత నాలుగేళ్లుగా హనుమాన్ స్వాములకు బిక్ష ఏర్పాటు చేస్తున్నారు. కాగా, ఈరోజు ఏర్పాటు చేసిన బిక్ష కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గారు హాజరై, ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రజలు భక్తి భావాన్ని పెంపొందించుకోవడం ద్వారా మానవ విలువలు పెరుగుతాయన్నారు. దీక్ష చేపట్టడం ద్వారా మానసిక రుగ్మతలు తొలగడంతో పాటు ఎదుటివారికి మేలు చేయాలనే మనస్తత్వం అలవాటు అవుతుందన్నారు. నియోజకవర్గ ప్రజలపై ఆంజనేయస్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు. గత నాలుగేళ్లుగా రాజమౌళి దంపతులు ఇలాంటి పూజా కార్యక్రమం చేపట్టినందుకు అభినందించారు…..