Listen to this article

జనం న్యూస్ మే 20 ముమ్మిడివరం ప్రతినిధి


భారత్ ప్రధాని నరేంద్ర మోడీ ఆపరేషన్ సింధూర్ విజయవంతం సంఘీభావంగా నిర్వహించిన తిరంగా యాత్రను పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం ముక్తేశ్వరం సెంటర్ లో మంగళవారం సాయంత్రం బీజేపీ మండల అధ్యక్షులు కుడుపూడి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముక్తేశ్వరం మండల కార్యాలయం నుంచి నుంచి ముక్తేశ్వరం సెంటర్ నాలుగు రోడ్ల జంక్షన్ వరకు తిరంగా యాత్ర భారీగా సాగింది. ఈ సందర్భంగా భారత్ మాతాకీ జై, భారత్ జిందాబాద్ వంటి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా భారీ త్రివర్ణ పతాకం తో ర్యాలీ నిర్వహించారు. మహిళలు కూడా ఈ ర్యాలీలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి లుగా బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా, జాతీయ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు నల్లా పవన్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి గనిశెట్టి వెంకటేశ్వరరావు, పి.గన్నవరం నియోజకవర్గ కన్వీనర్ చీకురుమెల్లి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ భారత సైనికుల స్ఫూర్తిని కొనియాడారు. ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పారన్నారు. భారత సైనికులకు భారత దేశం యావత్తు అండగా నిలిచారని అన్నారు. ఉగ్ర వాదం అంతమే మన పంతం అని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరవల్లి పాలెం సర్పంచ్ సలాది బుచ్చిరాజు, జనసేన నాయకులు తోలేటి ఉమా, జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త మద్దా చంటిబాబు, రాష్ట్ర మహిళా మోర్చా కార్యదర్శి ఆకుమర్తి బేబీ రాణి, సీనియర్ నాయకులు చీకురుమెల్లి శ్రీనివాసరావు, యనమదల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.