Listen to this article

(జనం న్యూస్ మే 21 చంటి)


దౌల్తాబాద్ మండలంలోని బాలికల ఉన్నత పాఠశాలలో జరుగుతున్నటువంటి మండల స్థాయి ఉపాధ్యాయుల రెండవ రోజు శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించినటువంటి డైట్ ప్రిన్సిపల్ గంగయ్య మాట్లాడుతూ మారుతున్న సమాజానికి అనుగుణంగా ఉపాధ్యాయులకు శిక్షణ అందించి పాఠశాల స్థాయిలో అది వినియోగించబడాలని సూచించడం జరిగింది నేడు నడుస్తున్న సాంకేతిక పరిజ్ఞానం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఏ విధంగా అయితే చలామణి అవుతుందో దానికి అనుగుణంగానే విద్యార్థులను తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు మండల స్థాయిలో శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయులు కచ్చితంగా పాఠశాల స్థాయిలో విద్యార్థులకు అందించాలని వారి భవిష్యత్తుకు మంచి పునాది వేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి గజ్జల కనకరాజు రిసోర్స్ పర్సన్ వేణుగోపాల్ మహారాజ్ బేగం త్యాగరాజు ప్రశాంత్ అదేవిధంగా పలు పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు సిఆర్పిలు రాజు నగేష్ కుమార్ పాల్గొన్నారు.