

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 21 రిపోర్టర్ సలికినీడి నాగరాజు
ఏపీయూడబ్ల్యూ tvజే ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ – తహసిల్దార్ కు వినతిపత్రం అందజేత
పల్నాడు జిల్లా మాచర్లలో ఇటీవల న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన ఉమ్మడి గుంటూరు జిల్లా సాక్షి ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి అశోక్ వర్ధన్పై కొందరు వ్యక్తులు దాడి చేసిన ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దాడిని భారత జర్నలిస్టుల సంఘం (ఐజేయు) తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్రశాఖ పిలుపు మేరకు చిలకలూరిపేటలో బుధవారం ఉదయం ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని కస్తూర్బా రోడ్డులో నిరసన ర్యాలీ, నినాదాలతో హోరెత్తిస్తూ తహసిల్దార్ కార్యాలయం వరకు సాగింది. “పత్రికా స్వేచ్ఛను కాపాడండి”, “పాత్రికేయులపై దాడులు ఆపండి” వంటి పాత్రికేయులు నినాదాలు చేశారు.
భవిష్యత్తులో ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతూ, స్థానిక తహసిల్దార్ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ ధనుంజయకు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు పుల్లగూర భక్తవత్సల రావు మాట్లాడుతూ, పాత్రికేయుల భద్రత కోసం ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ సభ్యులు పుల్లగూర భక్తవత్సలరావు, షేక్ జిలాని, చిలకలూరిపేట శాఖ అధ్యక్షులు అన్నల దాసు శేషగిరిరావు, కార్యదర్శి షేక్ అబ్దుల్ సత్తార్, ఎలక్ట్రానిక్ మీడియా శాఖ కార్యదర్శి మల్లాల కోటేశ్వరరావు, వాసు, కాట్రు శ్రీనివాసరావు, షేక్ హసన్ వలి, ఎస్.కె (కరీముల్లా), దార్ల బుచ్చిబాబు, షేక్ ఖాజా తదితరులు పాల్గొన్నారు.