

(జనం న్యూస్ చంటి మే 21)
ఈరోజు దౌల్తాబాద్ మండలం దొమ్మాట గ్రామంలో ఈరోజు వర్షం వర్షం కురవడంతో అన్నదాతలు అయోమయం అవుతున్నారు. చేతికొచ్చిన వరి ధాన్యాన్ని అమ్ముకుందామన్న సమయంలో ఒకేసారి వర్షం రావడంతో వరి ధాన్యం తడిసి ముద్దయింది. పడగండ్ల వానతో నష్టపోయిన రైతులు కాస్త మిగిలిన వరి ధాన్యాన్ని అమ్ముకుందామంటే వర్షం కురవడంతో రైతులు పూర్తిగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, వెంటనే ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వారిని కోరుతున్నారు.
