Listen to this article

ఏపీ ఈ ఏ పీ సెట్


జనం న్యూస్ మే 21 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)


డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం సమీపంలో కాట్రేనికోన మండలం చెయ్యురు నందు గల శ్రీనివాసా అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ కళాశాలల 2025 – 26 ప్రవేశములకు ఉద్దేశించబడిన ఏపీ ఈ ఏ పీ సెట్ 2025 ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైనాయి. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ & కరస్పాండెంట్ , డి.వి .ఎన్.ఎస్.వర్మ మాట్లాడుతూ కళాశాల లో ఈ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు ఈ నెల 27 వతేదీ వరకు జరుగుతాయి. విద్యార్థులందరకూ తగిన మౌళిక వసతులు కల్పించామని ఈ రోజు ఉదయం జరిగిన ప్రవేశ పరీక్షకు 202 మందికి గానూ 187 మంది, మధ్యాహ్నం జరిగిన ప్రవేశపరీక్షలు కు 202 విద్యార్థులకు గానూ, 192 మంది విద్యార్థులు హాజరై నారని 24
మంది విద్యార్థులు గైర్హాజరై నారని తెలిపారు. ఈ ప్రవేశ పరీక్షల సందర్భంగా విద్యార్థులకు ఏర్పాటు చేసిన సదుపాయములను సెక్రటరీ కరస్పాండెంట్ , డి.వి.ఎన్.ఎస్.వర్మ ప్రత్యేకంగా పర్యవేక్షించారు. ఈ పర్యవేక్షణలు కళాశాల పాలకవర్గ సభ్యులు, కళాశాల ప్రిన్సిపాల్ పాల్గొన్నారు.