

(జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బెజ్జరాపు శ్రీనివాస్)
జనం న్యూస్ మే 21, జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం : మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకురాలు మాజీ జడ్పిటిసి సభ్యులు జంగిలి సునీత దేవి ప్రత్యేక చొరవ తీసుకుని ప్రజా ప్రభుత్వ రథసారధి సీఎం రేవంత్ రెడ్డి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి మద్దతుతో ఒక లక్ష నాలుగు వేల రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కును లబ్దిదారు గౌడ సంఘం మండల అధ్యక్షుడు బుసరపు రాజేశ్వర్ తనయుడు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి, స్థాయికి మించి ఖర్చు అవడంతో బుసరపు సాయి ప్రసాద్ కి అండగా జంగిలి సునీత దేవి సిఎంఆర్ఎఫ్ చెక్కు అందించడం జరిగింది.. జంగిలి సునీతదేవి మాట్లాడుతు కాంగ్రెస్ ప్రజా పాలనలో నవతెలంగాణ పున:నిర్మాణం జరుగుతోందని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అన్ని రంగాల్లో తెలంగాణ ముందుకు ధూసుకు పోవటం చాలా సంతోషంగా ఉందని అన్నారు, అదే విధంగా లబ్ధిదారు మాట్లాడుతు చెక్కు మంజూరు చేసిన ప్రజా ప్రభుత్వానికి, మా కష్టాన్ని తమ కష్టంగా భావించి, చొరవ తీసుకుని చెక్కు మంజూరు చేయించిన జంగిలి సునీత దేవి కి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ ఇబ్రహీంపట్నం మాజీ జెడ్పిటిసి J సునీత దేవి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీకాంత్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరిగం రాజు వైస్ చైర్మన్ ఎలాల వెంకట్ రెడ్డి డైరెక్టర్ భూక్య రాజేందర్ ఎక్స్ ఎంపీటీసీ రాజారెడ్డి దేశెట్టిజీవన్ పుష్పాల నగేష్ అశోక్ గంగాధర్ రాజు లింగారెడ్డిగంగా పటేల్ తదితరులు పాల్గొన్నారు