

కాగజ్నగర్ ఫెర్టిలైజర్ షాపు యజమానులకు టౌన్ పోలీస్ స్టేషన్లో అవగాహన సదస్సు
జనం న్యూస్ మే 21 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, అడీషనల్ ఎస్పీ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు కాగజ్నగర్ పట్టణ టౌన్ సీఐ ప్రేమ్ కుమార్, ఎస్ఐ సుధాకర్ ల ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ లో బుధవారం స్తానిక ఫెర్టిలైజర్ షాపు యజమానులకు అవగహాన సదస్సు నిర్వహించారు.ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా కాగజ్నగర్ డీఎస్పీ రామానుజం పాల్గొని మాట్లాడారు. నకలి పత్తి విత్తనాలు, గ్లైసిల్(గడ్డి మందు) కూడా అమ్మకూడదని తెలిపారు. గ్లైసిల్ వలన భూసారం తగ్గిపోతుంది అని, ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని, అలాగే పీడీ ఆక్ట్ కూడా ఓపెన్ చేస్తామని అన్నారు. నకలి పత్తి విత్తనాలు ఎవరైనా సమ్మినట్టు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వారలని సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.ఈ కార్యక్రమం కాగజ్నగర్ పట్టణ ఫెర్టిలైజర్ యజమానులు పాల్గొన్నారు.