

జనం న్యూస్ మే 22(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
ములకలపల్లి కుమారి సిపిఎం పార్టీకి చేసిన సేవలు మరువలేని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ,సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రంలు అన్నారు.అనారోగ్యంతో మృతి చెందిన సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు సతీమణి ములకలపల్లి కుమారి భౌతిక ఖాయం పై బుధవారం మునగాల మండల పరిధిలోని కొక్కిరేణి గ్రామంలో పూలమాల వేసి జోహార్లు అర్పించారు. అనంతరం జరిగిన అంతిమ యాత్రలో పాల్గొన్న వారు మాట్లాడుతూ.. ములకలపల్లి రాములు పార్టీ నాయకుడిగా ఎదగడంలో కుమారి పాత్ర మరువలేనిదని అన్నారు. పార్టీ నాయకుడిగా,ప్రజా ప్రతినిధిగా తన భర్త రాములు ఎన్నికై ప్రజా సేవలో ఉన్నప్పుడు ఆమె ఎంతో ఓర్పుగా ఉంటూ అన్ని విధాలుగా ఆయనకు సహాయ, సహకారాలు అందించారని అన్నారు. ఇంటికి వచ్చే నాయకులకు, కార్యకర్తలను ఆప్యాయతగా పిలుస్తూ వారికి భోజనాలు పెట్టే వారన్నారు.భర్త పార్టీ పనిలో ఉండగా ఆమె కుటుంబ బాధ్యతలు చూస్తూ పిల్లలను పెంచిపోషించిందని అన్నారు.మునగాల మండలంలో శత్రువుల భారీ నుండి పార్టీని,కార్యకర్తలను కాపాడటంలో ములకలపల్లి రాములు ఎంతో కృషి చేశారని అన్నారు.పార్టీ ఆధ్వర్యంలో జరిగే అనేక ప్రజా పోరాటాలలో పాల్గొన్నారని గుర్తు చేశారు.ములకలపల్లి రాములు కు చేదోడు వాదోడుగా ఉండటమే కాకుండా పార్టీ, ప్రజా సంఘాల కార్యక్రమాల్లో పాల్గొనేదని అన్నారు. పార్టీ,ప్రజా సంఘాల మహాసభలు జరిగిన సందర్భంగా వాలంటీర్ గా అనేక సేవలు అందించడంలో కుమారి ముందువరుసలో ఉండేది అన్నారు.పార్టీ బాధ్యతలో ఉన్న నాయకులకు కుటుంబ బాధ్యతలు చూసే మహిళలు చాలా బాధాకరమైన అన్నారు. కుమారి మృతి పట్ల సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున సంతాపం సానుభూతి తెలిపారు.అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ మాట్లాడుతూ…వ్యవసాయ కార్మిక సంఘం నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమంలో సమావేశాలను కుమారి చాలా ఉత్సాహంగా పాల్గొనేదన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం ఉద్యమంలో గత 30 ఏళ్లుగా పనిచేస్తున్న సందర్భంలో అనేకసార్లు నేను వారి ఇంటికి వెళ్లిన సందర్భంలో చాలా ఆప్యాయతతో పలకరించి కలగొలుపుగా ఉండేది అన్నారు.రాములుకు అండదండలుగా ఉండే కుమారి మరణించడం చాలా బాధాకరమని అన్నారు. ఈ అంతిమ యాత్రలో సిపిఎం సీనియర్ నాయకులు చెరుపల్లి సీతారాములు,డిజి నరసింహారావు,సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి,మల్లు లక్ష్మి,బండారు రవికుమార్ ఎండి జహంగీర్ వ్యవసాయ కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు తప్పెట్ల స్కైలాబ్ బాబు,ఆర్ వెంకట రాములు,ప్రసాద్,నెమ్మాది వెంకటేశ్వర్లు,కొలిశెట్టి యాదగిరిరావు,కొండమడుగు నరసింహ,బట్టుపల్లి అనురాధ, డబ్బికారు మల్లేష్ సిపిఎం నల్గొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ సిపిఎం నల్గొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు ప్రభావతి, పాలడుగు నాగార్జున, చినపాక లక్ష్మీనారాయణ భువనగిరి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరు మల్లేశం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగారపు పాండు,కోట గోపి, మట్టిపల్లి సైదులు చెరుకు ఏకలక్ష్మి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు బొప్పన పద్మ జగన్ మేదరమెట్ల వెంకటేశ్వరరావు వట్టపు సైదులు ఎం ముత్యాలు షేక్ సైదా బుర్రి శ్రీరాములు దేవరం వెంకటరెడ్డి నందిగామ సైదులు ఆర్ వెంకన్న శంబయ తదితరులు పాల్గొన్నారు.
