

ఆ మహనీయుడి సేవలు మరువలేనివి.
నర్సాపూర్ లో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు
జనం న్యూస్. మే 21. మెదక్ జిల్లా. నర్సాపూర్. నియోజకవర్గం ఇన్చార్జ్. (అబ్దుల్ రహమాన్)
భారతదేశం సాంకేతికంగా అభివృద్ధి చెందడానికి కృషి చేసిన ఘనత దివంగత మాజీ ప్రధానిరాజీవ్ గాంధీ దేననికాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్. పిసిసి ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి అన్నారు. బుధవారం నర్సాపూర్ మున్సిపల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో రాజీవ్గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా మెదక్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికింది దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన భారత దేశాన్ని నిలిపిన ఘనత ఆయనదేనని ఈ సందర్భంగా గుర్తుచేశారు. దేశంలో పేదరికాన్ని పారద్రోలి సమసమాజ స్థాపనకు ఆయన చేసిన కృషి ఎప్పటికి మరవలేమని కొనియాడారు. దేశం కోసం తన ప్రాణాలను అర్పించి దేశ ప్రజల గుండెల్లో చిరకాలంగా నిలిచిన ఘనత ఆ మహానీయుడు రాజీవ్ గాంధీ సొంతమన్నారు. ఈ కార్యక్రమంలో. మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ గుప్తా. నర్సాపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రిజ్వాన్. మాజీ ఎంపీపీలు. జ్యోతి సురేష్ నాయక్. లలిత నర్సింగ్ నాయక్. శ్రీనివాస్ గౌడ్. మండల అధ్యక్షుడు. మల్లేశం. వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయ్ కుమార్. రషీద్. మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు అజ్మత్. ఓబీసీ సెల్ అధ్యక్షుడు రెడ్డిపల్లి అశోక్ గౌడ్. నరేష్. అశోక్. శ్రీశైలం యాదవ్. మల్లేష్ యాదవ్. వివిధ మండలాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
