

జనం న్యూస్ 22 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరంలో బుధవారం నిర్వహించిన మినీ మహానాడు కార్యక్రమంలో వైసీపీ నుంచి టీడీపీలోకి 100 కుటుంబాలు చేరాయి. గొల్లలపేటకి చెందిన వైసీపీ MPTC బూర రమణతో పాటు పలువురు టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. పొలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు టీడీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.