Listen to this article

జనం న్యూస్, మే 22, జగిత్యాల జిల్లా, కోరుట్ల:

పట్టణంలోని శ్రీ సాయి న్యూ లైఫ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న లావణ్య అను మహిళకు డెలివరీ నిమిత్తం ఆపరేషన్ చేస్తుండగా ఎక్కువగా రక్తస్రావం కావడం వలన అత్యవసరంగా 2 యూనిట్లు ఒ పాజిటివ్ రక్తం ఎక్కించాలని డాక్టర్ చెప్పడంతో పేషెంట్ కుటుంబ సభ్యులు డోనర్ కోసం వెతుకుతూ ఎనుగందుల ఉదయ్ కుమార్ ని సంప్రదించగా కోరుట్ల పట్టణంలోని PRBM జూనియర్ కళాశాలలో లెక్చరర్ గా విధులు నిర్వహిన్నా మెట్ పల్లి పట్టణానికి చెందిన గోపినవేని గంగాధర్ కి సమాచారం తెలుపగ గంగాధర్ మరియు తన మిత్రుడు సాహితి మహిళ డిగ్రీ కళాశాలలో లెక్చరర్ గా విధులు నిర్వహిస్తున్న పులిమామిడి ప్రవీణ్ కుమార్ ని తీసుకొని వచ్చి రక్తదానం చెయ్యడం జరిగింది. ఈరోజు గోపినవేని గంగాధర్ పెళ్ళి రోజు సందర్భంగా అత్యవసరంగా రక్తం ఇచ్చే అవకాశం వచ్చినందుకు తను సంతోషంగా ఉందని గంగాధర్, ప్రవీణ్ తెలిపారు. అలాగే పేషెంట్ తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము అన్నారు. అత్యవసర సమయంలో రక్తదానం చేసి ప్రాణధాతగా నిలిచిన గోపినవేని గంగాధర్, పులిమామిడి ప్రవీణ్ (MA English)ని బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, రక్తదాతల అనుసంధాన కర్త ఉదయ్ కుమార్ PRBM కళాశాల (కోరుట్ల) సిబ్బంది, సాహితి మహిళ డిగ్రీ కళాశాల సిబ్బంది, పేషెంట్ బంధువులు, స్నేహితులు అభినందించారు.