Listen to this article

జనం న్యూస్ మే 22 జగిత్యాల జిల్లా

బీరుపూర్ మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యాశాఖ ఆదేశాల మేరకు ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఆన్ కెపాసిటీ బిల్డింగ్ ద్వారా మండలంలోని సెకండరీ గ్రేడ్ టీచర్స్ కి ఎల్ ఎఫ్ ఎల్ హెడ్మాస్టర్స్ కి నిర్వహిస్తున్నటువంటి ఐదు రోజుల శిక్షణ కార్యక్రమంలో ఈరోజు బీర్పూర్ మండలం జడ్పీహెచ్ఎస్ బీర్పూర్ నందు నిర్వహించే శిక్షణ కేంద్రాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి కే రాము సందర్శించినట్టు మండల విద్యాధికారి ఎస్ నాగభూషణం తెలిపారు.. శిక్షణ కేంద్రాన్ని ఉద్దేశించి జిల్లా విద్యాధికారి కె రాము మాట్లాడుతూ ఉపాధ్యాయులందరూ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థుల స్థాయికి అనుగుణంగా పాఠశాలలో విద్యాబోధన జరగాలని నేటి ఆధునిక ప్రపంచానికి అనుగుణంగా బోధనలో మార్పులు తీసుకొస్తూ విభిన్న రీతులలో విద్యార్థి శారీరక మానసిక రంగాలలో అభివృద్ధి చెందే విధంగా విద్యాబోధన జరగాలని తెలిపినారు శిక్షణ ఇచ్చే ఆర్పీలను ఉద్దేశించి శిక్షణ ఇచ్చే విధానాన్ని పరిశీలించి అభినందించినారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి కే రాము రమణ గమండల విద్యాశాఖ అధికారి ఎస్ నాగభూషణం వివిధ సబ్జెక్టుల ఆర్పీలు ఉపాధ్యాయులు సిఆర్పిలు పాల్గొన్నారు….