Listen to this article

జనం న్యూస్ 23మే పెగడపల్లి ప్రతినిధి


జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని దేవి కొండ,నంచర్ల మరియు వివిధ గ్రామాలలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్న వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని పెగడపల్లి ఏఎంసీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ సందర్శించారు. చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ మండలంలోని పిఎసిఎస్ సీఈవో లు మధుకర్, గోపాల్ రెడ్డి మరియు రవీందర్ రెడ్డి,ఏపీఎం సమత తో ఫోన్ ద్వారా మాట్లాడి వరి ధాన్య నిల్వల వివరాలు తెలుసుకున్నారు. రైతులు అధైర్యపడవద్దని మండలంలోని అన్ని సెంటర్లలో దాదాపు 2500 నుండి 3000 క్వింటాళ్ల వరి ధాన్యం ఉందని చివరి గింజ వరకు మరో రెండు రోజుల్లో తూకం వేయించి వెనువెంటనే మిల్లులకు తరలించి కొనుగోలు పూర్తి చేపిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు గోగురి సతీష్ రెడ్డి, ఎడ్ల రాజయ్య,లైసెట్టి తిరుపతి,సద్వాల శ్రీనివాస్ బొడ్డు మధుకర్ మందపల్లి శ్రీనివాస్ రైతులు పాల్గొన్నారు.